Tuesday, April 23, 2024

పిడుగుపడి వ్యక్తి మృతి

తాండూరు రూరల్ : పిడుగు పడి ఓ వ్యక్తితో పాటు ఓ ఎద్దు మృతిచెందిన సంఘటన తాండూరు మండలం రాంపూరు కింది తాండలో చోటుచేసుకుంది. తాండా వాసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండాకు చెందిన మూఢవత్ రవి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం వారి పొలం వద్ద ఉన్న ఎద్దును తీసుకువచ్చేందుకు వెళ్ళాడు. మధ్యాహ్నం తరువాత భారీ వర్షం ప్రారంభం కావడంతో పొలంలోని చెట్టు కిందకు వెళ్ళాడు. పెద్ద శబ్దంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంలో పిడుగు పడింది. దీంతో రవితో పాటు పక్కనున్న ఎద్దు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement