Friday, April 26, 2024

బాలికను నిప్పులపై నడిపించిన భూతవైద్యుడు.. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలిక

వికారాబాద్ : గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న బాలికను ఓ భూత వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అతను సంబంధిత బాలికను నిప్పులపై నడిపించిన సంఘటనలో ఆ బాలిక తీవ్ర అస్వస్థతకు గురి కాగా అపస్మారక స్థితిలో ఉన్న బాలికను వికారాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ధరూర్ మండలం కుక్ కింద గ్రామానికి చెందిన వెంకటయ్య, మంజుల దంపతుల కూతురు అశ్విని (18) గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉండగా తెలిసిన వారితో కలిసి వారు పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన రఫీక్ అనే భూతవైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. సంబంధిత భూతవైద్యుడు బాలికకు గాలి సోకిందని చెబుతూ సంబంధిత బాలికను నిప్పులపై నడవాలని సూచించాడు. బాలిక కాళ్లు పూర్తిగా కాలిపోయి అపస్మారక స్థితికి చేరడంతో సంబంధిత అధికారులు వెంటనే తేరుకుని వికారాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి సీరియస్ గా ఉంది. మరో 24 గంటలపాటు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని సంబంధిత డాక్టర్లు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement