Wednesday, April 24, 2024

మరదలిపై బావ కత్తితో దాడి.. మెడ, చేతిపై తీవ్రగాయాలు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ANM గా విధులు నిర్వహిస్తున్న అనిత ఆమె బావ కిషన్ (అక్క భర్త) గురువారం తెల్లవారుజామున తను పనిచేస్తున్న చోటుకి వచ్చి కత్తితో దాడి చేశాడు. బాధితురాలికి మెడపై, చేతికి గాయలవ్వటంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది అంబులెన్స్ లో షాద్ నగర్ పట్టణంలోని కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనిత సొంత గ్రామం ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందినవారుగా తెలుస్తుంది .ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement