Thursday, April 25, 2024

బంగారు తెలంగాణలో అభివృద్ది..

షాద్‌నగర్ : బంగారు తెలంగాణలో అభివృద్ది పరించేందుకు టిఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తామని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. నాగార్జున సాగర్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ నందికొండ మున్సిపాలిటీలో పాదయాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా గడపగడపకు తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేయ్యాలని కోరుతూ ఓటర్ల విజ్ఞాప్తి చేశారు. ఏ ప్రభుత్వం చేయలేనన్ని సంక్షేమ పథకాలు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకు వచ్చిందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ వెనుకబడిందని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ పూర్తి దశలో అభివృద్ది జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ అహర్నిశలు తెలంగాణ కోసం శ్రమిస్తున్నారని అన్నారు. తెలంగాణ ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే సీటుగెలిచి కానుకగా ఇవ్వాలని ప్రజలను కోరారు. టిఆర్‌ ఎస్‌ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమల కోసం పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌, బిజేపి వల్ల తెలంగాణకు వరగబెట్టింది ఏమి లేదని అన్నారు. బిజేపి కాంగ్రెస్‌ పార్టీలను ప్రజలు నమ్మరని అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement