Wednesday, April 24, 2024

ముగ్గురు పిల్లల చదువుకు భరోసా..

కుత్బుల్లాపూర్‌ : జగద్గిరిగుట్ట డివిజన్‌ పరధిలోని మగ్దూంనగర్‌లో నివాసం ఉంటున్న సత్యలక్ష్మీ తల్లిదండ్రులను కోల్పోయిన తన అన్న పిల్లలు సాయితేజ(15), చరణ్‌ తేజ (12), వరణ్‌తేజ (10)లను అన్ని తానై చూసుకుంటుంది. ఈ ముగ్గురు పిల్లల తల్లి అనారోగ్యంతో, తండ్రి హార్ట్‌ ఎటాక్‌తో చనిపోవడం వల్ల ఈ పిల్లల పోషణను సత్యలక్ష్మీ చూసుకుంటుంది. నిరుపేద కుటుంబం కావడంతో వారి చదువుల నిమిత్తం సత్యలక్ష్మీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్‌ మానవతాదృక్పథంతో బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. రూ. 1 లక్ష విలువ చేసే చెక్కును తన గౌరవ వేతనం నుండి ఆమెకు తన నివాసం వద్ద అందజేశారు. అలాగే ముగ్గురు పిల్లలకు గురుకుల పాఠశాలలో విద్యనభ్యసించే విధంగా ఏర్పాటు చేస్తానని భరోసానిచ్చారు. ఈ మేరకు తమకు అండగా నిలిచిన సందర్భంగా సత్యలక్ష్మీ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ కొలుకుల జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement