Thursday, April 25, 2024

కుటుంబ సభ్యులతో కలిసి భోగీ మంటలు వేసిన మంత్రి సబితారెడ్డి

రాష్ట విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి భోగీ మంటలు వేశారు. శుక్రవారం నగరంలోని శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో వేడుకల్లో పాల్గొన్నారు. మనుమరాలు అక్షయీని, మనుమడు ఇంద్రా రెడ్డితో కలిసి భోగి మంటలు వేశారు. గంగిరెద్దు ముందు మొక్కి పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భోగి పండుగ ​శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండగ‌ అని మంత్రి పేర్కొన్నారు. కరోనా లాంటి కష్టాలు భోగి మంటల్లో తొలగిపోవాలని మంత్రి ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలతో పాటు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పార్టీ నాయకులకు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement