Thursday, March 28, 2024

ఆర్డీఓకు వినతిపత్రం..

తాండూరు : మున్సిపల్‌ పరిధిలోని దేవాలయాలు, మసీదుల వద్ద శానిటైజర్‌ పిచికారి చేయించాలని ప్రతిపక్ష పార్టీ ఫ్లోర్‌ లీడర్లు సోమశేఖర్‌, వరాల శ్రీనివాస్‌రెడ్డి, మహమ్మద్‌ ఆసీఫ్‌, కౌన్సిలర్‌ ప్రభాకర్‌గౌడ్‌లు కోరారు. మున్సిపల్‌ కార్యాలయంలో తాండూరు ఆర్డీఓ, మున్సిపల్‌ ఇంచార్జ్‌ కమిషనర్‌ అశోక్‌కుమార్‌ను కలిసి వి నతి పత్రం అందజేశారు. రాబోయే ఉగాది, రంజాన్‌ పండగలను దృష్టిలో ఉంచుకుని దేవాలయాలు, మసీదులు, ప్రార్థన స్థలాల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరారు. కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో శానిటైజర్‌ పనులు చేయించాలని కోరారు. దోమల మందు కూడ పిచికారి చేయించాలని కోరారు. వీదుల్లో రోడ్లు, మురుగు కాలువలను కూడ ప్రతిరోజు శుభ్రం చేయాలని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement