Thursday, April 18, 2024

పూలే చిత్రపటానికి నివాళ్లు..

యాచారం : యాచారం పట్టణ కేంద్రంలో ప్రజా సంఘాలు అంబేద్కర్‌ యువజన సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిరావుపూలే 195వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ పూలే చేసిన సేవలు మరిచిపోలేనివని బహుజన బతుకుల్లో జ్యోతి మహత్మ పూలే అని భారతమాత ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి గోప్ప సామాజిక సంస్కర్త మహిళ విద్య అభివృద్దికి ఆయన చేసిన కృషి మరిచిపోలేనిదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు ఆర్పించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు అనిల్‌ కుమార్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అంజయ్య, సిఐటియు నాయకులు బ్రహ్మయ్య, ఎమ్మార్పీఎస్‌ నాయకులు సాయిలు, యాదగిరి, మస్క్‌ యాదయ్య, ప్రతాప్‌, రాజు, ప్రసాద్‌, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement