Thursday, April 25, 2024

సాగర్‌లో బిజెపి గెలుపు ఖాయం..

తాండూరు : నాగార్జున సాగర్‌కు జరుగుతున్న ఉపపోరులో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయమని ఆ పార్టీ వికారాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్‌కుమార్‌ అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాంగా సాగర్‌ మండలంలోని మారేపల్లి, యాచారం శక్తి కేంద్రం ఎన్నికల ఇంచార్జ్‌గా నియమితులైన ఆయన పార్టీ అభ్యర్థి తరుపున ప్రచారం చేపట్టారు. ఆయా గ్రామాల్లో గడప గడపకు తిరుగుతూ బీజేపీ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యు.రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ నాగార్జున సాగర్‌ ఎన్నికల్లో బీజేపీ జనరల్‌ సీటును ఒక గిరిజన సామాన్య వ్యక్తికి కేటాయించిందని గుర్తుచేశారు. అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తున్న బీజేపీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థి రవినాయక్‌ను సాగర్‌ ప్రజలంతా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజల మద్దతుతో సాగర్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు వెంకటేష్‌, వికారాబాద్‌ జిల్లా నాయకులు బంటారం భద్రేశ్వర్‌, ప్యాట శంకర్‌, సందీప్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement