Friday, March 29, 2024

మూడేళ్ల కుమారుడిని కొట్టి చంపిన తల్లి

మేడ్చల్‌ జిల్లాలో దారుణం జరిగింది. కన్నప్రేమను మరిచిన ఓ తల్లి కర్కోఠకంగా వ్యవహరించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన మూడేళ్ల కుమారుడిని విచక్షణారహితంగా కొట్టి హతమార్చింది. సూరారం పరిధిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. దారుణానికి ఒడిగట్టిన మహిళ రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉంటూ మరో వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్నది. ఉదయం విక్షణ కోల్పోయిన ఆమె కుమారుడు ఉమేశ్‌(3)ను తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితికి చేరాడు. దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇద్దరి మధ్య కుమారుడి అడ్డున్నాడనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement