Wednesday, April 24, 2024

సీఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్సీలు.. ఏ కగ్రీవంగా ఎన్నిక కావడంపై హర్షం

ప్రభ న్యూస్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ లుగా ఏకగ్రీవంగా ఎన్నికైన పట్నం మహేందర్ రెడ్డి… శంభీ పూర్ రాజు ను సీఎం కేసీఆర్ అభినందించారు. ఆదివారం ఎమ్మెల్సీ లు సీఎం కేసీఅర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. బాగా కష్టపడ్డారని నేతలను అభినందించారు. ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే లు కృష్ణారావు, వివేకానంద, మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీలు నవీన్ రావు తదితరులతో కలిసి సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement