Thursday, April 25, 2024

ఎంజేపీ గురుకుల ఇంటర్‌ స్పాట్ అడ్మిషన్లు

మొయినాబాద్‌, (ప్రభన్యూస్‌): మహాత్మాజ్యోతి రావుపూలే గురుకులం ఇంటర్‌లో ప్రవేశానికి స్పాట్‌ ఆడ్మిషన్లు జరుగుతున్నట్లు రంగారెడ్డి జిల్లా వెనుకబడిన తరగతుల రీజనల్‌ కో- ఆర్టీనేటర్‌ యాదయ్యగౌడ్‌ తెలిపారు. మహత్మాజ్యోతి బాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్మీడియేట్‌ ప్రవేశాలకు ఈ నెల 29వ తేదీన సం బంధిత కళాశాలలో స్పాట్‌ ఆడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఎంపీసీ గ్రూపులో సంబంధించి వికారాబాద్‌ (6), నవాబుపేట్‌ (4) బీపీసీ గ్రూపుకు సంబంధించి కొడంగల్‌ (16), యాలాల్‌(9) వికారాబాద్‌ (16), నవాబుపేట(12), సీఈసీలో కొడంగల్‌ (10), యాలాల్‌ (10), వికారాబాద్‌ (08), ఎంఈసీలో కొడంగల్‌ (31) ఖాళీ సీట్లు ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి కల్గిన విద్యార్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు 2సెట్లు సర్టిఫికెట్‌ల తో సోమవారం సంబంధిత కళాశాలలో ఉదయం 10: 30 గంటలకు హజరు కావాలని కోరారు. ఇందుకు సంబంధిత కళాశాల సెల్‌ఫోన్‌ నెంబర్లు కొడంగల్‌ 9966714713, యాలాల్‌ 9701506695, నవాబుపేట 7989649926, వికారాబాద్‌ 9000276957 ఈ నె ంబర్లలో సంప్రందించాని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement