Thursday, April 25, 2024

Missing Child: 24 గంటలు గడుస్తున్నా.. లభించని పాప ఆచూకీ..?

కీసర : దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న జీడాల నరేష్ భవానిల మూడో కుమార్తె ఇందు (10) జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో నివసిస్తున్నారు. గురువారం ఉదయం పాప తండ్రి నరేష్ దమ్మైగూడ లోని ప్రభుత్వ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ లో వదిలిపెట్టి వెళ్లిన తర్వాత నుంచి అదృశ్యమైంది. 24 గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు పాప‌ ఆచూకీ దొరకలేదు.. కేసు నమోదు చేసుకొని జవహర్ నగర్ పోలీసులు గాలిస్తున్నారు. బంధువులు పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక పాప స్కూల్ లో నుండి వెళ్లిపోయిందా? అని స‌రౌండింగ్ లోని సీసీ పుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇంచుమించు వెయ్యి మంది చదువుకునే పిల్లలున్న స్కూల్ ముందు ఇందు అదృశ్యం అవ్వడం ఆశ్చర్యకరమైన విషయం.. పాప తల్లిదండ్రులు ఆందోళన చెందుతు స్కూల్ టీచర్ల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ముందు ధర్నాకు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement