Saturday, April 20, 2024

ఎంబీబీఎస్ చదివేందుకు మంత్రి స‌బితారెడ్డి రూ.లక్ష సహాయం..

రంగారెడ్డి : ఓ విద్యా కుసుమానికి మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అండగా నిలిచారు. మంచి ర్యాంక్ తో ఎంబీబీఎస్ లో సీటు సాధించిన ఓ విద్యార్థినికి ఇంద్రన్న ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయల సహాయం అందించి మంచి మనస్సు నిరూపించుకున్నారు. ఇటీవల సరూర్ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారిణి, ప్రస్తుత బీఆర్ఎస్ నాయకురాలు సుధ కూతురు వెన్నెలను మంత్రి అభినందించారు. ఫీజుకు సంభందించి మంత్రి దృష్టికి తీసుకురాగా.. అప్పుడే సహాయం ప్రకటించారు. ఈ మేరకు ఫీజుకు సంబంధించి లక్ష రూపాయల చెక్కును ఇంద్రన్న ట్రస్ట్ చైర్మన్ కార్తీక్ రెడ్డి సుధకు అందజేసారు. ఈ సందర్భంగా సుధ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. జీవితాంతం రుణపడి ఉంటానని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement