Thursday, April 25, 2024

అమరవీరుల స్మారక స్థూపం కోసం స్థలాన్ని పరిశీలించిన..మంత్రి సబితా

వికారాబాద్ (ప్రభ న్యూస్): తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్మారక స్థూపం నిర్మించడం కోసం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్థలాన్ని పరిశీలించారు.. వికారాబాద్ నుండి తాండూర్ వెళ్లే మార్గంలో ఆర్ఎంపీ అతిథి గృహం సమీపంలో ఈ స్థలాన్ని ఆమె స్థానికే ఎమ్మెల్యే ఆనంద్ చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య.. పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.. కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద పటేల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఎస్పీ కోటిరెడ్డి తో కలిసి ఆమె స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఈ విషయమై సంబంధిత అధికారులు తమకు నివేదిక సమర్పించాలని ఉద్యమాల గడ్డ ఐన తెలంగాణకు సంబంధించి వికారాబాద్ లో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా స్మార‌క‌స్థూపం ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. త్వరలో ఈ ఏర్పాట్లు వేగవంతం చేయాలని ఆమె అధికారులు ఆదేశించారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, మాజీ వైస్ చైర్మన్ చిగులపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement