Friday, April 26, 2024

సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్రంలో ఒకేసారి భారీగా 91,142 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయడం పట్ల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేసారు. ఈ మేరకు మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహిళ ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ… రైతులకు ఏటా 10వేలు పంట పెట్టుబడి సహాయంగా అందిస్తూ రైతు బంధుగా, మహిళలకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి మహిళ బంధు అయినట్లే, ఇప్పటికే ఒక లక్ష 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి నేడు 90 వేల పై చిలుకు ఉద్యోగాల ప్రకటనతో యువత బంధు అయ్యారని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగ క్యాలెండర్ తో ప్రభుత్వ శాఖల్లో ప్రతి సంవత్సరం ఖాళీలు తెలిసి వెంటనే నియామకాలు జరిపే అవకాశముంటుంద‌న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిరుద్యోగ యువత తరుపున మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement