Thursday, April 18, 2024

తుంకుంట మున్సిపాలిటీలో మంత్రి మల్లారెడ్డి సుడిగాలి పర్యటన

మేడ్చల్ నియోజకవర్గం తుంకుంట మున్సిపాలిటీ పరిధిలో రాష్ట కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. రూ.5.52కోట్లతో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మంచినీటి పైప్ లైన్, బీటీ రోడ్డు, వైకుంఠ దామాలు, సెంట్రల్ లైటింగ్ కు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు మల్లారెడ్డి. సకాలంలో పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ వాణి వీర రెడ్డి, పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement