Tuesday, April 16, 2024

నాగారంలో మార్కెట్ నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన

మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని నాగారం మున్సిపాలిటీలో వెజ్.. నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణానికి రాష్ట కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. రూ.4.50 కోట్లతో ఈ మార్కెట్ ను నిర్మించనున్నారు. ఇంటిగ్రెటేడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ పనులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, అధికారులు, నాయకులు, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement