Friday, March 29, 2024

అభివృద్ది పనులకు ‌మంత్రి ‘కేటిఆర్’ శంకుస్థాపన..

కొత్తూర్‌ : మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి కేటిఆర్‌, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూడున్నర కోట్ల రూపాయల వ్యయంతో కొత్తూరు మున్సిపల్‌ కార్యాలయ భవన నిర్మాణంతో పాటు.. రెండున్నర కోట్ల రూపాయల వ్యయంతో సమీకృత కూరగాయల మార్కెట్‌ యార్డు.. అదే విధంగా మరో రెండు కోట్ల రూపాయలతో కొత్తూరులో మెరుగైన వీధి దీపాల ఏర్పాటుకు హమీ ఇస్తూ కేటిఆర్‌ మాట్లాడారు. త్వరలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు రాబోతుందని ఇక్కడి ప్రాంతం అవుటర్‌ రిండ్‌ రోడ్డు.. రూరల్‌ రింగ్‌ రోడ్డు.. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య కొత్తూరు ఎంతో ప్రగతి సాధిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ ప్రాంతానికి బంగారు భవిత ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించగా ఎంతో అభివృద్ది సాధించామని కేటిఆర్‌ వివరించారు. నాడు కాంగ్రెస్‌ పాలనలో కనీసం తాగునీటికి కూడ నోచుకోలేదని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక మిషన్‌ భగీరథ ద్వారా మంచి నీరు పుష్కలంగా లభిస్తుందని అన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక 200ల నుండి రూ. 2వేల వరకు 10 రేట్లు ఫించన్‌ పెంచిన ఘనత ప్రభుత్వానిదే అని గుర్తు చేశారు. పేదల ముఖంలో చిరునవ్వు చూసేందుకు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి 6కిలోల చొప్పున బియ్యం పంపిణి చేస్తున్నట్లు పేర్కోన్నారు. పేదవాళ్లు చదువుకునే సర్కార్‌ బడిలో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో 4 లక్షల 50వేల మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని.. అదే విధంగా ఒక్కో విద్యార్థినిపై ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత ఆరేళ్లలో ఎస్సీ, ఎస్టీ బిసి మెనార్టీ విద్యార్థుల విద్య కోసం 12వేల 800 కోట్ల రూపాయలు ఫీజు రీయంబర్స్‌ మెంట్‌ చెల్లించామన్నారు. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌.. పూలే పేరిట విదేశీ విద్య కోసం ఒక్క విద్యార్థికి 20లక్షల రూపాయలను చెల్లిస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా వ్యవసాయానికి ఉచిత కరెంటు, గృహాలకు పరిశ్రమలకు 24గంటల నిరంతరం విద్యుత్‌ ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని కొనియడారు. వ్యవసాయ అభివృద్ధికి రైతు బంధు, రైతు కుటుంబం.. రక్షణ రైతు బీమా పథకాలతో రైతులను ఆదుకున్నట్లు చెప్పారు. కేసిఆర్‌ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం వసతి లభిస్తుందని అన్నారు. మా తండాలో మా రాజ్యం అనే విధంగా లంబాడిల ఆత్మ గౌరవాన్ని ఇనుమడింప చేస్తే 3400 తండాలను పంచాయతీలుగా చేశామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కొత్త మండలాలు.. కొత్త రెవెన్యూ డివిజన్‌లు కొత్త జిల్లాలతో అభివృద్ది వైపు దూసుకుపొతుందని అన్నారు. తెలంగాణలో పేద ప్రజల బిడ్డలు పెళ్లి చేసుకుంటే కల్యాణ లక్ష్మీ, షాదిముబారక్‌ పథకాలతో ఆదుకున్నామన్నారు. ఎమ్మెల్యే అంజయ్య కొరిక మేరకే కొత్తూరు మండలాన్ని మున్సిపాలిటీగా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని తెలిపారు. త్వరలో కొత్తూరు మున్సిపాలిటీకి ఎన్నికలు రాబోతున్నాయని మున్సిపాలిటీలో 12 వార్డులకు 12వార్డుల్లో గులాబి జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అంజన్నకు అండగా నిలబడితే ప్రభుత్వం ప్రజలకు బాసటగా నిలుస్తుందని అన్నారు. మండలంలో బ్రహ్మండమైన పరిశ్రమలు రాబోతున్నాయని ప్రకటించారు. పని చేసే ప్రభుత్వానికి పని చేసే నాయకుడికి అండగా నిలువాలని పిలుపునిచ్చారు. వివాద రహితుడు.. అందరికి ఆత్మీయుడు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు అండగా నిలువాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కులమత రాజకీయలు టిఆర్‌ఎస్‌ చేయదని అన్ని వర్గాలు తమకు సమానమేనని హిందిలో ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్టీలో నూతనంగా చేరిన వారికి కండువాలు కప్పి అహ్వనించారు. ఈ కార్యక్రమంలో ఎంపి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ తీగల అనిత రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్‌రెడ్డి, బీష్మ కిష్టయ్య, జడ్పి వైస్‌ చైర్మన్‌ ఈట గణేష్, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వంకాయల నారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బాబయ్య, ఎంపిపి మధుసూధన్‌రెడ్డి, జడ్పిటిసి శ్రీలత సత్యనారాయణ, మాజీ జడ్పిటిసి శ్యాంసుందర్‌రెడ్డి, ఆర్డీఓ రాజేశ్వరి, ఏసిపి కుషాల్కర్‌, సిఐ శ్రీధర్‌ భూపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement