Saturday, April 20, 2024

జవహర్ నగర్ లో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన : రూ.34కోట్ల ప‌నుల‌కు శంకుస్థాప‌న‌

జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. దాదాపు రూ.34కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కార్పొరేషన్ పరిధిలో హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో ఓఆర్ఆర్ ఫేస్ 2 త్రాగునీటి సరఫరా కోసం చేపట్టే పనులకు, రోడ్డు విస్తరణ, చెన్నాపురం చెరువు సుందరీకరణ పనులకు మంత్రి మల్లారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావ్య, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement