Saturday, April 20, 2024

అమరవీరుల స్మారకస్థూపం.. స్థల పరిశీలనలో మంత్రి సబితా రెడ్డి

వికారాబాద్ (ప్రభ న్యూస్): తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్మారక స్థూపం నిర్మాణానికి శనివారం సాయంత్రం మంత్రి సబితారెడ్డి స్థలాన్ని పరిశీలించారు. వికారాబాద్ నుండి తాండూర్ వెళ్లే మార్గంలో ఆర్​అండ్​బీ అతిథి గృహం సమీపంలో ఈ స్థలాన్ని పరిశీలించారు.

దీనికోసం సంబంధిత అధికారులు నివేదిక సమర్పించాలని సూచించారు. త్వరలో ఈ ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఆనంద్, కాలె యాదయ్య, మహేశ్వర్ రెడ్డి, నరేందర్ రెడ్డితో పాటు బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద పటేల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఎస్పీ కోటిరెడ్డి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement