Thursday, April 25, 2024

విద్య విలువ తెలుసుకో…. భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకో

మహేశ్వరం: బడికి వెళ్ళి చదువుకోవాలి… బాబు కూరగాయలు అమ్మవద్దు అంటూ.. ఓ బాలునికి చదువుల మంత్రి సబితమ్మ సూచించారు. మ‌హేశ్వ‌రం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీలో ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా అంగడిలో కూరగాయలు అమ్ముతూ ఓ బాలుడు కనిపించాడు. వెంటనే ఆ బాలుడి వద్దకు వెళ్లిన మంత్రి సబితా రెడ్డి బడికి వెళ్ళి చవువుకోవాలని బాలుడికి హితబోధ చేశారు. వివరాలు తెలుసుకోగా ఎన్.డీ తాండ కు చెందిన బాలుడు కావడంతో సర్పంచ్ రాజునాయక్ కు ఫోన్ చేసి, బాలుడిని పాఠశాలకు పంపించాలని చెప్పారు. పిల్లలను పనుల్లో పెట్టకుండా చదివించాలని ఈ సందర్భంగా తల్లిదండ్రులకు మంత్రి సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement