Thursday, March 28, 2024

కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

కుత్బుల్లాపూర్‌ : కార్ముకుల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్‌ అన్నారు. సుభాష్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని జీడిమెట్ల ఇండస్ట్రియల్‌ ఫేస్‌ 5లో ఆంధ్రపాలిమర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆద్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌కేవీ జెండా అవిష్కరణ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని గుడిమెట్ల సురేష్‌రెడ్డితో కలిసి జెండాను అవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్మికులంతా ఐకమత్యంగా ఉంటూ సమస్యలు తన దృష్టికి తీసుకవస్తే యాజమాన్యాలతో చర్చించి వాటి పరిష్కారంలో ముందుంటామని హమీనిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, కొలుకుల జగన్‌, మాజీ కౌన్సిలర్‌ రంగారావు, నాయకులు శ్రీనివాస్‌, రాజు, యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ డి. రసూల్‌, జాయింట్‌ సెక్రటరీ రవికిరణ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డి.జోగారావు, ట్రెజరర్‌ శ్రీనివాస్‌, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement