Monday, March 25, 2024

కోట్ పల్లి ప్రాజెక్ట్ మృతుల‌కు.. మంత్రి స‌బితారెడ్డి నివాళులు

కోట్ పల్లి ప్రాజెక్ట్ వద్ద చోటు చేసుకున్న సంఘటన అత్యంత బాధాకరమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కోట్ పల్లి ప్రాజెక్టులో విహార యాత్రకు వెళ్లి మృత్యువాత పడిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాల వద్ద ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి… డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డిలతో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులర్పించారు. మంగళవారం ఉదయం పరిగి నియోజకవర్గం పూడూరు మండలం మన్నెగూడ గ్రామంలో బాధిత కుటుంబ‌ సభ్యులను పరామర్శించారు. కుటుంబ‌ సభ్యులతో ప్రమాదానికి సంబందించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులు జగదీష్, వెంకటేష్, లోకేష్, రాజేష్ ల మృతదేహాల వద్ద నివాళులర్పించారు. ఈ దుర్ఘటన చాలా బాధాకరమ‌ని, కుటుంబ‌ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపి ఓదార్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement