Thursday, April 25, 2024

ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే..

వికారాబాద్‌ : జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ నగర్‌ సమీపాన ఉన్న 100 పడకల ఆస్పత్రిని వికారాబాద్‌ ఎమ్మెల్యే.. డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు కోవిడ్‌ వాక్సిన్‌ కోసం టెస్టుల కోసం వస్తున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగుకుండా ఉంచటం కోసం పాత ఆస్పత్రి నుండి కొత్త ఆస్పత్రికి మార్చటం జరిగిందని తెలిపారు.ప్రజలందరు తప్పని సరిగా వాక్సినేషన్‌ చేయించుకోవటంతో పాటు నిరంతరం మాస్క్ లు ధరించాలని,భౌతిక దూరం పాటించాలని,శానిటైజర్‌లు వాడాలని ఆయన సూచించారు.అత్యవసర పరిస్థితులలో తప్ప ప్రజలెవరు ఇంట్లలో నుండి బయటకురావద్దని సూచించారు.ఇంట్లో ఉన్న సమయంలో సహితం తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్‌ కొండేటి కృష్ణ,పిఎసిఎస్‌ చైర్మన్‌ ముత్యం రెడ్డి,మార్కెట్‌ కమిటి చైర్మన్‌ విజయ కుమార్‌,పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు ప్రభాకర్‌ రెడ్డి,కౌన్సిలర్‌ అనంత్‌ రెడ్డి,మాజీ జెడ్‌పిటిసిముత్తహార్‌ షరీఫ్‌,డాక్టర్‌ రమ్య శ్రీ ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement