Thursday, April 25, 2024

తెల్లారితే పెళ్లి.. వరుడు ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తెల్లారితే పెళ్లి అనగా.. పెళ్లి కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తలకొండపల్లి మండలం మెదక్‌పల్లి గ్రామంలో శ్రీకాంత్‌ (24) అనే యువకుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ వైపు పెళ్లికి కుటుంబీకులు ఏర్పాట్లు చేస్తుండగానే శ్రీకాంత్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. శ్రీకాంత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డడంతో అటు కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతుండగా.. పెళ్లి కూతురు ఇంట విషాదం అలుముకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement