Wednesday, April 24, 2024

అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం..

మేడ్చల్ : మేడ్చల్‌ పట్టణాభివృద్దిలో భాగంగా రూ. 10లక్షలతో 12వ వార్డులో అంతర్గత మురుగు కాల్వ పనులను మేడ్చల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మర్రి దీపికా నర్సింహారెడ్డి, 12వ వార్డు కౌన్సిలర్‌ బత్తుల ప్రియాంక మధుకర్‌ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలోని ఆదర్శవంతంగా మున్సిపాలిటీ తీర్చిదిద్దడమే లక్ష్యంగా అభివృద్ది చేస్తామని మర్రి దీపిక నర్సింహారెడ్డి పేర్కోన్నారు. 12వ వార్డు కౌన్సిలర్‌ బత్తుల ప్రియాంక మధుకర్‌ యాదవ్‌ మాట్లాడుతూ వార్డులో ఏ సమస్యను తన దృష్టికి తీసుకు రావాలని వీలైనంత వరకు త్వరగా పరిష్కరిస్తానని ఆమె హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ చీర్ల రమేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, మేడ్చల్‌ మాజీ ఉపసర్పంచ్‌ మర్రి నర్సింహారెడ్డి, టిఆర్‌ఎస్‌ నాయకులు బత్తుల మధుకర్‌ యాదవ్‌, మున్సిపల్‌ ఏఈ సాయిరాంరెడ్డి,శానిటరి ఇన్సెఫెక్టర్‌ రాంచందర్‌, 12వ వార్డు ప్రజలు, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement