Saturday, April 20, 2024

తుక్కుగూడ మున్సిపాలిటీ అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యం : స‌బితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం: తుక్కుగూడ మున్సిపాలిటీ అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వానికే సాధ్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంత్రి మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నగరంలోని కార్పొరేషన్లకు ధీటుగా మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని పేర్కొన్నారు. అనంతరం మోజా ఇటాలియా రెస్టారెంట్ ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆర్.జ్ఞానేశ్వర్, టీఆర్ఎస్ కౌన్సిలర్లు సుమన్, రవినాయక్, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు జెల్లల లక్ష్మయ్య, టీఆర్ఎస్ నాయకులు నిమ్మగూడెం శ్రీనివాస్ గౌడ్, సప్పిడి రాజు, పుంటికూర చంద్రశేఖర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement