Thursday, April 25, 2024

ఆసరా కోసం రోడ్డెక్కిన పింఛన్ దారులు

జవహర్ నగర్ : జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆసరా పెన్షన్ దారులు సోమవారం రోడ్డు పై బైఠాయించి ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతి నెల తమను పింఛన్ పేరుతో వృద్ధులను, దివ్యాంగులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నార‌ని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ అందిస్తామని గొప్పలు చెబుతుందని అన్నారు. సరైన సమయానికి పింఛన్ ఇవ్వకుండా పింఛన్ దారులను ఇబ్బంది పెట్టడం బాధాకరమన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement