Thursday, March 28, 2024

కరోనా వ్యాక్సిన్‌ ఎంతో సురక్షితం…

షాద్‌ నగర్‌ : కరోనా మహమ్మారి నియంత్రించేందుకు అందరు టీకా తీసుకోవాలని 6వ వార్డు కౌన్సిలర్‌ పులిమామిడి లతాశ్రీ శ్రీశైలం గౌడ్‌ అన్నారు. ఆయన కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్‌ ఎంతో సురక్షితమని, టీకా తీసుకోవడంలో ఎలాంటి అపోహాలు వద్దన్నారు. 45ఏండ్లు నిండిన వారితో పాటు వచ్చే నెల 1వ తేది నుంచి 18 సంవత్సరాలు నిండిన వారంతా టీకా వేసుకునేందుకు ముందుకు రావాలన్నారు. వ్యాక్సిన్‌ తీసుకోని కరోనాను నియంత్రించాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడ బయటకు రావద్దని ఒక వేళ వస్తే విధిగా మాస్కు ధరించి సామాజిక దూరం పాటిస్తూ ..శానిటైజర్‌ తో తరుచు చేతులు శుభ్రం చేసుసుకుంటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement