Saturday, April 20, 2024

శంకర్ ప‌ల్లిలో కరోనా వైరస్ విజృంభణ

శంకర్ ప‌ల్లి మున్సిపాలిటీ, మండల పరిధిలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. శంకర్ ప‌ల్లి కూరగాయల మార్కెట్ ను సరిచేయాల్సిన అవసరముంది. క‌రోనా వైర‌స్ అక్కడి నుండి వ్యాప్తి చెందుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల కంటే అధికంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో టెస్టులు చేయించుకుంటున్నారు. అధికారికంగా నమోదయ్యే కరోనా వైరస్ కేసుల కంటే అనధికారికంగా ఉంటున్న కేసులు రెట్టింపు స్థాయిలో ఉంటున్నాయి. గత వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. చుట్టు పక్కల ప్రాంతాలు కలుపుకొని ఒకే రోజు 13 కేసులు బయటపడ్డాయి. క‌రోనా వైర‌స్ విజృంభించ‌డంతో ఆ ప్రాంత ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement