Wednesday, April 17, 2024

ద‌ర్బార్ బార్ ముందు మ‌హిళా సంఘాల‌ ఆందోళన

మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడ ప్రధాన రహదారి పక్కన ఉన్న దర్బార్ బార్ లో రాత్రి యాజమాన్యానికి, కస్టమర్ల‌కు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దాడిలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ఉప్పల్ ఆదిత్య హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఆ యువకుడికి మద్దతుగా స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో దర్బార్ బార్ ముందు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా చేప‌ట్టాయి. వెంటనే బార్ యజమానిపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే దర్బార్ బార్ ను సీజ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ధర్నా వద్ద మేడిపల్లి పోలీసులు గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement