Thursday, April 25, 2024

బాధితులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్..

మేడ్చల్‌ : పేద ప్రజలకు వైద్య ఖర్చుల కోసం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మద్దుల లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి పేర్కోన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ పట్టణ పరిధిలోని కండ్లకోయ పట్టణానికి చెందిన రేణుక అనే వ్యక్తికి అనారోగ్యం కారణంగా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ను సిఎం రిలిఫ్‌ ఫండ్‌ మంజూరు చేయాలని కోరగా వెంటనే మంత్రి మల్లారెడ్డికి చెప్పగా నిధులు మంజూరు చేయడంపై బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధులు ఎంతోగాను ఉపయోగపడుతున్నాయని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ సర్పంచ్‌ మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దామన్నగారి ప్రభాకర్‌, మున్సిపల్‌ తెరాస పార్టీ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కే. నరేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్‌ లు భేరి బాలరాజు, దొడ్ల మల్లికార్జున్‌ ముదిరాజ్‌, నాయకులు రాజేందర్‌, ప్రవీణ్‌ కుమార్‌, బాధితులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement