Wednesday, April 24, 2024

చలివేంద్రాన్ని ప్రారంభించిన చైర్‌పర్సన్‌..

మేడ్చల్‌ : వేసవిలో దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ పట్టణ పరిధిలోని కండ్లకోయ సమీపంలోని సాయిగీతా ఆశ్రమం రోడ్డులో దాతలు డి. రామరాజు, వెంకట్‌రాజులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ డి. ప్రభాకర్‌లు పాల్గోని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండె ఎండల్లో పాదచారులకు ప్రజలకు దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన దాతలకు చైర్‌ పర్సన్‌ లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. చలివేంద్రం ద్వారా సంవత్సరం పొడువున తాగు నీరు అందించడం చాలా మంచిదని నిర్వాహాకులను చైర్‌పర్సన్‌ లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి కొనియడారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ సర్పంచ్‌ మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్‌లు దొడ్ల మల్లికార్జున్‌ ముదిరాజ్‌, భేరి బాలరాజు, మున్సిపల్‌ తెరాస వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ నరేందర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement