Thursday, April 25, 2024

ప్రాణంతీసిన దొంగ సెల్‌ఫోన్..! – బండ‌రాయితో మిత్రున్ని హ‌త్య చేసిన స్నేహితులు

తాండూరు : దొంగ‌త‌నం చేసిన ఓ సెల్ ఫోన్ ముగ్గురు స్నేహితుల జీవితాల‌ను చిన్నాభిన్నం చేసింది. దొంగ ఫోన్‌ను విక్ర‌యించాల‌ని అంట‌గ‌ట్టిన స్నేహితునిపై క‌క్ష్య పెంచుకుని బండ‌రాయితో మోది హ‌త్య చేశారు. ఈ సంఘ‌ట‌న వికారాబాద్ జిల్లా తాండూరు నియోజ‌క‌వ‌ర్గం పెద్దేముల్ మండ‌లంలో క‌ల‌క‌లం రేపింది. ఇందుకు సంబంధించి వెలుగులోకి వ‌చ్చిన వివ‌రాలిలా ఉన్నాయి. తాండూరు ప‌ట్ట‌ణం గాంధీన‌గ‌ర్ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ (16), మ‌ల్‌రెడ్డిప‌ల్లికి చెందిన రాజు, తాండూరు మండ‌లం అంతారం గ్రామానికి చెందిన జశ్వంత్‌లు తాండూరు ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌లో ఇంట‌ర్ చ‌దువుతున్నారు. అయితే ప్ర‌శాంత్ ఇటీవ‌లే ఓ సెల్‌ఫోన్‌ను చోరీ చేసి దానిని విక్ర‌యించాల‌ని రాజు, జ‌శ్వంత్‌ల‌కు అప్ప‌గించాడు. దీనిని వారు విక్ర‌యించేందుకు వెళ్ల‌గా షాపు య‌జ‌మాని గ‌మ‌నించి దొంగ‌ఫోన్‌గా గుర్తించాడు. దీంతో రాజు, జ‌శ్వంత్‌ల‌ను బెదిరించాడు. ఎలాగోలా అక్క‌డి నుంచి వెళ్లిపోయిన రాజు, జశ్వంత్‌లు దొంగ‌ఫోన్‌ను అప్ప‌గించాడ‌ని ప్ర‌శాంత్‌పై క‌క్ష్య పెంచుకున్నారు. బుధ‌వారం సాయంత్రం మాట్లాడుకుందామ‌ని రాజు, జశ్వంత్‌లు ప్ర‌శాంత్‌ను పిలిపించారు. ముగ్గురు క‌లిసి పెద్దేముల్ మండ‌లం గొట్ల‌ప‌ల్లి స‌మీపంలోని నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లారు. అక్క‌డ ముగ్గురి మ‌ధ్య‌ మాటా మాట పెర‌గ‌డంతో రాజు, జశ్వంత్‌లు ప్ర‌శాంత్‌పై బండ‌రాయితో దాడి చేసి హ‌త్య చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement