Saturday, April 20, 2024

ఒక్క సిసి కెమెరా వెయ్యి మంది పోలీస్‌లతో సమానం..

షాద్‌నగర్ : ఒక్క సిసి కెమెరా వెయ్యి మంది పోలీస్‌లతో సమానమని టౌన్‌ సిఐ శ్రీధర్‌కుమార్‌ అన్నారు. కిరాణా అసోసియేషన్‌ అధ్యక్షులు పట్ల సతీష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కిరాణ అసోసియేషన్‌ తరుపున లక్ష రూపాయల చెక్కును సిసి కెమెరాల కోసం విరాళం అందజేశారు. పలభట్ల పాండురంగం లక్ష రూపాయలు , బండారు రమేష్‌ రూ. 50వేలు, ప్రకాష్‌ లక్షరూపాయలు, పలభట్ల లక్ష్మీ నర్సింహ్మా రూ. లక్ష రూపయలు సీసీ కెమెరాలకువిరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐ శ్రీధర్‌ కుమార్‌ మాట్లాడుతూ పట్ట ణంలో శాంతిభద్రతలను పరిరక్షించడం కోసం ప్రతి ఒక్కరు తమ ఇళ్ల ముందు సిసి కెమెరాలను అమర్చుకోవాలని సూచి ంచారు. ముఖ్యంగా అపరిచిత వ్యక్తులు దొంగతనాలకు పాల్పడే వారిని అరికట్టేందుకు సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలభట్ల బాలరాజు , ప్రవీణ్‌ , శ్రీనివాస్‌, తదితరులు పాల్గోన్నారు.
———————————————-
లక్ష రూపాయలు పలభట్ల పాండురంగం, రూ.50వేలు బండారు రమేష్‌, లక్ష రూపాయలు ప్రకాష్‌, పలభట్ల లక్ష్మీ నర్సింహ్మా రూ. లక్ష రూపయలు

Advertisement

తాజా వార్తలు

Advertisement