Thursday, April 25, 2024

బ‌స్సును ఓవ‌ర్ టేక్ చేయ‌బోయి – బైక్ ను ఢీకొన్న లారీ – ఒక‌రు మృతి

తాండూరు రూర‌ల్ : బ‌స్సును ఓవ‌ర్ టేక్ చేయ‌బోయిన ఓ లారీ భైక్ ని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో భ‌ర్త‌, కూతురు ఓ వైపు ప‌డిపోగా..భార్య మ‌రోవైపు ప‌డిపోయింది. భార్యపై నుంచి లారీ వెళ్ల‌డంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి క‌ర‌ణ్ కోట్ ఎస్ఐ మ‌ధుసూధ‌న్ రెడ్డి తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. తాండూరు మండ‌లం గౌతాపూర్‌లోని వంశీ పాలిషింగ్ యూనిట్లో బోయ‌నూరు వీర‌ప్ప‌, త‌న భార్య బోయ‌నూరు సురేఖ‌(27) కార్మికుల‌కు గా ప‌నిచేస్తున్నారు. అయితే సురేఖ చెల్లెలు మామ చ‌నిపోవ‌డంతో భ‌ర్త వీర‌ప్ప‌, కూతురుతో క‌లిసి సురేఖలు బైక్ పై బ‌య‌ల్దేరారు. మండ‌లంలోని సిరిగిరిపేట్ గ్రామ శివారు వ‌ద్ద‌కు రాగానే చించొల్లి వైపు నుంచి వ‌స్తున్న లారీ డ్రైవ‌ర్ లారీనీ ముందు వెళుతున్న.. బ‌స్సును ఓవ‌ర్ టేక్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు. అదే స‌మ‌యంలో వీర‌ప్ప వెళుతున్న బైకును ఢీకొట్టింది. ఈ క్ర‌మంలో బైకుపై ఉన్న వీర‌ప్ప‌, కూతురు ఓ వైపు ప‌డిపోగా.. భార్య సురేఖ మ‌రోవైపు ప‌డిపోయింది. అంత‌లోనే లారీ సురేఖ త‌ల‌పై నుంచి దూసుకెళ్లింది. దీంతో సురేఖ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. క‌ర‌ణ్ కోట్ ఎస్ఐ మ‌ధూసూధ‌న్ రెడ్డి, పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రి మార్చురికి త‌ర‌లించారు. భ‌ర్త పిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు ఎస్ఐ మ‌ధుసూధ‌న్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement