Friday, March 29, 2024

బీజేపీ వాళ్లది ఢిల్లీలో ఒక మాట.. గల్లీలో ఇంకోమాట.. హరీశ్ రావు

బీజేపీ వాళ్లు ఢిల్లీలో ఒక మాట.. గల్లీలో ఇంకోమాట మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. మేడ్చల్ లో ఆయన మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయన్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అన్ని అనుమతులు ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గ్రోత్ ఇంజిన్ అని నితిన్ గడ్కరీ అన్నారన్నరు. అధికారం కోసం బీజేపీ వాళ్లు ఏమైనా చేస్తారన్నారు. ఉచితాలు బంద్ చేయాలని ప్రధాని అంటున్నారన్నారు. రైతు బంధు వద్దని చెప్తున్నారన్నారు. కళ్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్ వద్దంటారా అని ప్రశ్నించారు. పేదలకు ఉచితాలు వద్దట.. బడాబాబులకు మాత్రం కానుకలు కావాలంటున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement