Thursday, April 25, 2024

పేకాట స్థావరంపై దాడి : 13మంది అరెస్ట్

వికారాబాద్ : గ‌త‌ రాత్రి కోట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న వారిపైన జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు, కోట్ పల్లి పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 13 మంది పేకాట‌రాయుళ్ల‌ను అదుపులోకి తీసుకొని, వారినుండి రూ.77,290ల‌ నగదు,13 సెల్‌ఫోన్‌లు, 5 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. కోట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement