Thursday, March 28, 2024

మాక్ ఎంసెట్ తో ఎంతో ఉపయోగం… మంత్రి సబితారెడ్డి

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) : మాక్ ఎంసెట్ తో విద్యార్థులకు ఒక అవగాహన వస్తుందని… ఇది ఎంతో ఉపయోగమ‌ని రాష్ట్ర‌ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రముఖ ఆన్ లైన్ అసెస్మెంట్ ప్లాట్ ఫారం సంస్థ ఐన ఎక్స్ ప్లోర్.కో.ఇన్, గీతాంజలి కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కీసర, ఆధ్వర్యంలో నిర్వహించబడు మాక్ ఎంసెట్ టెస్ట్ సిరీస్ కు సంబంధించిన‌ పోస్టర్ ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… విద్యార్థుల కోసం స్వచ్చందంగా ముందుకు వచ్చి మాక్ టెస్ట్ నిర్వహిస్తున్న సంస్థ ప్రతినిధులను అభినందించారు. విద్యార్థులు ఏకాగ్రతతో ఇష్టపడి చదివి పరీక్షలు రాయాలని సూచించారు.

సంస్థ డైరెక్టర్ అఖిల్ మోదే మాట్లాడుతూ… ఈ సిరీస్ లోని నాలుగు మాక్ టెస్టులను ఎంసెట్ కు హాజరు కానున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు వారి ప్రాక్టీస్ కోసం వినియోగించుకొనవచ్చని తెలిపారు. పరీక్ష వ్రాసిన వారికి వారి ఫలితాలు వెంటనే తెలియబడుతాయని, తద్వారా మెయిన్ పరీక్షలకు విద్యార్థులు మరింత మెరుగైన కృషి చేయవచ్చునని పేర్కొన్నారు. సంస్థ డైరెక్టర్ తాడేపల్లి సునీల్ మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాలు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే మంచి ప్రమాణాలతో కూర్చబడినవి తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు https://tseamcet.xplore.co.in/ నందు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. తదుపరి మాక్ టెస్టులు ఏప్రిల్ 15, 25, 30 తేదీల్లో నిర్వహించబడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ హెడ్ ప్రణీత్ నల్లి కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement