Thursday, April 25, 2024

ముగ్గురికి కరోనా..

యాచారం : పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం రోజు 43మందికి కరోనా ర్యాపిడ్‌ టెస్టులు చేయగా ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. గత కొంత కాలంగా నిత్యం పాజిటివ్‌లు వస్తూనే ఉన్నాయి. యాచారం మండలంలో దిన దినానికి కరోనా మహమ్మారి విజృంభిస్తుండటం వల్ల ప్రజలు కొంత మేర భయాందోళనకు గురవుతున్నారని చెప్పుకోవాలి. చాలా మంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్లే తిరిగి కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. కావున ఇప్పటికైన ప్రజలంతా అప్రమత్తమై మాస్క్‌లను ధరిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తు ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement