Friday, March 29, 2024

సాంకేతిక లోపంతో తెరుచుకొని రైల్వే గేట్ : నిలిచిన‌ వాహనాలు

దేవరకద్ర, (ప్రభ న్యూస్) : మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని దేవ‌ర‌క‌ద్ర‌ మండల కేంద్రంలో బుధవారం ఉదయం సాంకేతిక లోపంతో రైల్వేగేటు తెరుచుకోకపోవడంతో దాదాపు అరగంటకు పైగా వాహనాలు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇటీవలే వాహనాలు దాదాపు కిలోమీటరు పొడవునా ఆగిపోయాయి. దీనివలన వాహనదారులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది అక్కడికి వచ్చి రైల్వే గేట్ ను మళ్లీ మరమ్మతులు చేశారు. తదుపరి వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. ఇకముందు కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement