Thursday, April 25, 2024

దుబ్బాకకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదు – అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన రఘునందన్..

హైదరాబాద్ – తాను ప్రాతినిధ్యం వహిస్తున్న దుబ్బాక నియోజకవర్గానికి నిధులు ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని బిజెపి ఎమ్మెల్యే ర‌ఘనంద‌న‌రావు అసెంబ్లీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే కార్య‌క్ర‌మంలో ఆయ‌న ప్ర‌సంగిస్తూ, స్పెషల్ డెవలెప్మెంట్ స్కీం కింద గజ్వేల్ కు రూ.890 కోట్లు, సిద్ధిపేటకు రూ.790కోట్ల నిధులు ఇచ్చిన సీఎం కేసీఆర్.. దుబ్బాక నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేన‌ని, ఎన్నిసార్లు కోరిన ఒక్క పైసా కూడా ఇవ్వ‌డం లేదంటూ పైర్ అయ్యారు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధికి నిధులిచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిప‌డ్డారు..

భాగ్యనగరంలో పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం లేదని రఘునందన్ అన్నారు. ఇంటి నిర్మాణానికి గతంలో రూ.5లక్షలు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు దాన్ని రూ.3లక్షలకు తగ్గించిందని, అసలు సొంత జాగా ఉన్నోళ్లకు ఆర్థిక సాయం ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. 2019లో నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించినా ప్రభుత్వం మూడేళ్లైనా ఇంకా అమలు చేయలేదని గుర్తు చేశారు. ట్రైబల్ యూనివర్సిటీకి కేంద్రం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించడంలేదని ఆరోపించారు. వడ్ల కొనుగోలు విషయంలో కేసీఆర్ సర్కారు కేంద్రాన్ని బద్నాం చేస్తోందని, ఈ విషయంలో మోడీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని రఘునందన్ స్పష్టం చేశారు.
ఐదింటిలో మూడు ఈవెంట్లలో పాసైన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ కు అనుమతించడంతో పాటు కటాఫ్ మార్కుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచాలని కోరారు. సర్పంచుల సమస్యను సభలో ప్రస్తావించిన రఘునందన్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో వారు ఆత్మహత్య చేసుకుంటున్నారని వాపోయారు. ప్రగతి భవన్ ముందు ఓ సర్పంచ్ కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్రం అన్నివిదాల రాష్ట్రానికి స‌హ‌క‌రిస్తున్న విష‌యం గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంతోనే తేట‌తెల్ల‌మైంద‌న్నారు.. కేంద్రాన్ని విమ‌ర్శిస్తూ ఒక్క ప‌దం కూడా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో లేక‌పోవ‌డాన్ని ఎత్తి చూపుతూ, కేంద్రం ఇస్తున్న స‌హ‌కారానికి ఇది నిద‌ర్శ‌మ‌న్నారు ర‌ఘ‌నంద‌న్

Advertisement

తాజా వార్తలు

Advertisement