Thursday, April 25, 2024

వారు హత్య చేసి ఉంటారు..: వామన్ రావు దంపతుల హత్యపై పుట్టా మధు

హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు దంపతుల హత్య పై పెద్దపల్లి జిల్లాపరిషత్ ఛైర్మన్ పుట్టా మధును స్పందించారు. ఈ హత్యలతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పుట్టా మధును పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు మధును విచారించిన పోలీసులు… నిన్న అర్ధరాత్రి ఆయనను ఇంటికి పంపించారు. మధు భార్యను కూడా పోలీసులు విచారించారు. వామన్ రావు దంపతుల హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. కుంట శ్రీను, బిట్టు శ్రీనులే ఆ హత్య చేసి ఉంటారని చెప్పారు. పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement