Friday, April 26, 2024

ఆ కేసులో వైఎస్ షర్మిల, విజయమ్మకు ఊరట..

ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మకు ఊరట లభించింది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టి వేసింది. 2012 లో పరకాల ఉపఎన్నికల్లో భాగంగా అనుమతి లేకుండా సభ నిర్వహించారని కేసు నమోదు అయింది. అప్పటి నుంచి వాయిదాలు పడుతూ వస్తున్న కేసును ఎట్టకేలకు కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా మురళి సహా 9 మందిపై ఉన్న కేసు కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరిచింది.

ఇది కూడా చదవండి: జనసేనానికి షాక్.. పవన్ శ్రమదానానికి నో పర్మిషన్!

Advertisement

తాజా వార్తలు

Advertisement