Tuesday, April 16, 2024

హైదరాబాద్ కు ప్రియాంక గాంధీ.. పర్యటన ఎందుకంటే..

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం హైదరాబాద్ రానున్నారు. తన కుమారుడు రైహాన్ వాద్రాకు కంటి పరీక్షలు చేయించేందుకు ఆమె హైదరాబాద్ కు వస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో రైహాన్ వాద్రాకు కంటి పరీక్షలు చేయించనున్నారు. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత గురువారం ఆమె తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు.

కాగా, రైహాన్ వాద్రాకు గతంలోనూ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. కొంతకాలం క్రితం రైహాన్ వాద్రా క్రికెట్ అడుతున్న సమయంలో కంటికి దెబ్బతగిలింది. ఢిల్లీలోని ఎఐఐఎంఎస్ కు తీసుకువెళ్లి పరీక్ష చేయించగా.. అక్కడి డాక్టర్లు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే కుమారుడికి మరోసారి కంటి పరీక్షలు చేయించేందుకు ఆమె రేపు హైదరాబాద్‌కు రానున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement