Thursday, April 25, 2024

సమ్మక్క జాతరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు

సమ్మక్క జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి సారంగపాణి పేర్కొన్నారు. గురువారం సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల వద్ద జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ జాతర వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటుచేశామన్నారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవార్లను దర్శించుకావాలన్నారు. బందోబస్తులో సిఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రదీప్ కుమార్, అనిల్, ఎస్ఐలు ఉపేందర్, వెంకటకృష్ణ, సహదేవ్ సింగ్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement