Thursday, April 25, 2024

షర్మిలకు షాక్ ఇచ్చిన పోలీసులు.. కాన్వాయ్ ని అడ్డుకుని…

రంగారెడ్డి జిల్లా పాలెపల్లి ఐకేపీ సెంటర్‌లో ధాన్యాన్ని ప‌రిశీలించ‌డానికి వెళ్తున్న వైఎస్‌ షర్మిలను  పోలీసులు అడ్డుకున్నారు. హైద‌రాబాద్‌లోని లోటస్‌పాండ్ నుంచి వికారాబాద్ జిల్లా చింతపల్లి దగ్గరకు రాగానే ఆమె కాన్వాయ్‌ను పోలీసులు నిలిపివేశారు. కొవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా షర్మిల కాన్వాయ్‌లో రెండు వాహనాలకే అనుమతి ఉంది. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించారంటూ కాన్వాయ్‌లోని ఇతర వాహనాలను చింతపల్లి దగ్గర పోలీసులు నిలిపివేయ‌డంతో ష‌ర్మిల మ‌ద్ద‌తుదారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సందర్భంగా కాసేపు పోలీసులకు, షర్మిల అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే, ప్ర‌తిపక్ష పార్టీల నేత‌లు అసత్య ప్రచారం  చేస్తున్నార‌ని వారిని అడ్డుకుంటామ‌ని టీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించడంతో ఐకేపీ సెంటర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement