Friday, March 29, 2024

ఎస్‌బీఐ పేరుతో నకిలీ కాల్‌సెంటర్‌

ఎస్‌బీఐ పేరుతో నగరంలో నిర్వహిస్తున్న నకిలీ కాల్‌సెంటర్‌ గుట్టు రట్టైంది. ఎస్‌బీఐ కేవైసీ, క్రెడిట్‌ కార్డుల పేరిట ఢిల్లీ కేంద్రంగా ఓ ముఠా దీన్ని నడిపిస్తున్నట్లు సైబరాబాద్ సైబర్‌ క్రైం పోలీసులు గుర్తించారు. నకిలీ కాల్‌ సెంటర్‌ ఆధారంగా ముఠా సభ్యులు దేశ వ్యాప్తంగా రూ.కోట్లు కొల్లగొట్టినట్లు వారి విచారణలో తేలింది. కాల్‌సెంటర్‌పై దాడి చేసిన పోలీసులు నిందితులకు సంబంధించిన పలు ఖాతాల్లోని నగదును పోలీసులు సీజ్‌ చేశారు. ఈ ముఠా సభ్యులు దేశవ్యాప్తంగా 209 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement