Wednesday, April 24, 2024

ఆస్తి కోసం హత్య.. పోలీసుల అదుపులో నిందుతులు

కరీంనగర్ జిల్లా లో సంచనలం రేపిన హత్య కేసును పోలీసులు చేధించారు. వివరాల్లోకి వెళ్లితే.. కేశవపట్నం మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన మాతంగి కొమురమ్మ-తిరుపతి దంపతులకు ఇద్దరు కూతుర్లు,ఒక కొడుకు ఉంఉన్నారు. భర్త తిరుపతి గత 4 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో తిరుపతి తండ్రి మద్యానికి బానిసై కోడలిపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో తరుచు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆస్తి కోసం తన మామను హత్య చేసేందుకు కోడలు కొమురమ్మ పథకం రచించింది. ఇందు కోసం తన అక్క కొడుకైన మాతంగి ప్రవీణ్ సాయం తీసుకుంది.

మామ కనకయ్య నిద్రిస్తున్న వేళ ఆయనపై దాడి చేశారు. కర్రతో కొట్టి.. అతని మెడకు నైలాన్ త్రాడు చుట్టి ఉరి వేయగా, ఇద్దరు కలిసి బలంగా లాగడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వృద్ధుడి హత్య గురించి ఎవరికి చెప్పకుండా రాత్రంతా శవాన్ని అలాగే ఉంచి,నిందితులు ఏమి తెలియనట్లు ఉన్నారు. మరుసటి రోజు ఉదయం పక్కింటి మాతంగి శాంతమ్మ వచ్చి చూడగా,ఇట్టి హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ  ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement